ఎవరీ శిల్పా షిండే... పురుషుల హక్కుల ఎన్జీవో ఎందుకు మండిపడుతోంది?
- నిర్మాతపై పదేళ్ల క్రితం అబద్ధపు లైంగిక వేధింపుల కేసు పెట్టానని వెల్లడి
- ఆ సమయంలో కాంట్రాక్ట్ చెల్లింపుల కోసం గత్యంతరం లేకే అలా చేశానని వెల్లడి
- తప్పుడు కేసు పెట్టిన శిల్పాను అరెస్ట్ చేయాలని పురుషుల హక్కుల సంఘం డిమాండ్
- 'భాభీజీ ఘర్ పర్ హైన్!' సీరియల్ సమయంలో వివాదం
ప్రముఖ టెలివిజన్ నటి శిల్పా షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దాదాపు పదేళ్ల క్రితం ఒక నిర్మాతపై తాను అబద్ధపు లైంగిక వేధింపుల కేసును పెట్టానని ఆమె స్వయంగా ఒప్పుకోవడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో తప్పుడు కేసు నమోదు చేసినందుకు ఆమెను తక్షణమే అరెస్ట్ చేయాలని పురుషుల హక్కుల ఎన్జీవో డిమాండ్ చేస్తోంది.
వివరాల్లోకి వెళితే, ‘భాభీజీ ఘర్ పర్ హైన్!’ సీరియల్తో ప్రసిద్ధి చెందిన శిల్పా షిండే, ఇటీవల కమెడియన్ భారతీ సింగ్, హర్ష్ లింబాచియా హోస్ట్ చేసిన ఒక పోడ్కాస్ట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2017లో నిర్మాత సంజయ్ కోహ్లిపై తాను తప్పుడు లైంగిక వేధింపుల కేసు పెట్టానని అంగీకరించారు. "కాంట్రాక్ట్ వివాదాలు, చెల్లింపులలో జాప్యం కారణంగా నాకు వేరే మార్గం కనిపించలేదు. అందుకే ఆ కేసు పెట్టాను. అది అబద్ధం అని మొదటిసారి ఒప్పుకుంటున్నాను" అని ఆమె తెలిపారు. రావాల్సిన డబ్బులు అందాక కోర్టు బయటే కేసును పరిష్కరించుకున్నామని వివరించారు.
శిల్పా షిండే ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే, ఢిల్లీకి చెందిన 'ఎన్సీఎంఇండియా కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్' అనే పురుషుల హక్కుల సంస్థ స్పందించింది. "డియర్ ముంబై పోలీస్, నిర్మాతపై తప్పుడు లైంగిక వేధింపుల కేసు పెట్టినందుకు శిల్పా షిండేను దయచేసి అరెస్ట్ చేయండి అని ఎక్స్లో పోస్ట్ చేసింది. నిజమైన బాధితులను రక్షించే చట్టాలను ఇలా దుర్వినియోగం చేయడాన్ని అరికట్టాలని వారు కోరుతున్నారు.
ఈ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమెను విమర్శిస్తుండగా, నటి బెబికా ధుర్వే వంటి వారు నిజం చెప్పినందుకు ధైర్యవంతురాలని ప్రశంసించారు. ప్రస్తుతం శిల్పా, నిర్మాత కోహ్లి కుటుంబంతో సత్సంబంధాలనే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే, ‘భాభీజీ ఘర్ పర్ హైన్!’ సీరియల్తో ప్రసిద్ధి చెందిన శిల్పా షిండే, ఇటీవల కమెడియన్ భారతీ సింగ్, హర్ష్ లింబాచియా హోస్ట్ చేసిన ఒక పోడ్కాస్ట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2017లో నిర్మాత సంజయ్ కోహ్లిపై తాను తప్పుడు లైంగిక వేధింపుల కేసు పెట్టానని అంగీకరించారు. "కాంట్రాక్ట్ వివాదాలు, చెల్లింపులలో జాప్యం కారణంగా నాకు వేరే మార్గం కనిపించలేదు. అందుకే ఆ కేసు పెట్టాను. అది అబద్ధం అని మొదటిసారి ఒప్పుకుంటున్నాను" అని ఆమె తెలిపారు. రావాల్సిన డబ్బులు అందాక కోర్టు బయటే కేసును పరిష్కరించుకున్నామని వివరించారు.
శిల్పా షిండే ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే, ఢిల్లీకి చెందిన 'ఎన్సీఎంఇండియా కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్' అనే పురుషుల హక్కుల సంస్థ స్పందించింది. "డియర్ ముంబై పోలీస్, నిర్మాతపై తప్పుడు లైంగిక వేధింపుల కేసు పెట్టినందుకు శిల్పా షిండేను దయచేసి అరెస్ట్ చేయండి అని ఎక్స్లో పోస్ట్ చేసింది. నిజమైన బాధితులను రక్షించే చట్టాలను ఇలా దుర్వినియోగం చేయడాన్ని అరికట్టాలని వారు కోరుతున్నారు.
ఈ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు ఆమెను విమర్శిస్తుండగా, నటి బెబికా ధుర్వే వంటి వారు నిజం చెప్పినందుకు ధైర్యవంతురాలని ప్రశంసించారు. ప్రస్తుతం శిల్పా, నిర్మాత కోహ్లి కుటుంబంతో సత్సంబంధాలనే కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.